45,788 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2021-05-12T06:18:59+05:30 IST
మిర్చియార్డు పరిధిలోని కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లకు మంగళవారం 39,914 టిక్కీలు వచ్చాయి. నిల్వ ఉన్న వాటితో కలిపి 45,788 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, మే 11 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డు పరిధిలోని కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లకు మంగళవారం 39,914 టిక్కీలు వచ్చాయి. నిల్వ ఉన్న వాటితో కలిపి 45,788 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 6,398 టిక్కీలు నిల్వ ఉన్నాయి. మంగళవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్కు కనిష్ఠంగా రూ. 6,500, గరిష్ఠంగా రూ. 13,000, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ.17,400, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ.5,000, రూ.8,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరి ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.