56,488 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2021-05-11T05:44:15+05:30 IST

మిర్చియార్డు పరిధిలోని కోల్డ్‌స్టోరేజ్‌లు, గోడౌన్లకు సోమవారం 47,179 టిక్కీలు రాగా, నిల్వ ఉన్న వాటితో కలిపి 56,488 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

56,488 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డు పరిధిలోని కోల్డ్‌స్టోరేజ్‌లు, గోడౌన్లకు సోమవారం 47,179 టిక్కీలు రాగా, నిల్వ ఉన్న వాటితో కలిపి 56,488 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 12,272 టిక్కీలు నిల్వ ఉన్నాయి. సోమవారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ. 7,000, గరిష్ఠంగా రూ.13,000, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.17,200, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.5,000, రూ.8,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-05-11T05:44:15+05:30 IST