Minister Ktr: కేంద్ర సాయంపై కిషన్‌రెడ్డివి తప్పుడు లెక్కలు

ABN , First Publish Date - 2022-07-22T03:40:41+05:30 IST

తెలంగాణ (Telangana)కు కేంద్ర సాయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Central Minister Kishanreddy)వి తప్పుడు లెక్కలు అని ....

Minister Ktr: కేంద్ర సాయంపై కిషన్‌రెడ్డివి తప్పుడు లెక్కలు

హైదరాబాద్: తెలంగాణ (Telangana)కు కేంద్ర సాయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Central Minister Kishanreddy)వి తప్పుడు లెక్కలు అని మంత్రి కేటీఆర్‌ (Minister Ktr) అన్నారు. 2018 వరకు తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ (NityanandRai) ప్రకటనను కిషన్‌రెడ్డి చదవాలని ఆయన హితవు పలికారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు రూ.15,270 కోట్ల నిధులు ఇచ్చారని.. గుజరాత్‌ (GuJarath)లో 2021 వరదలప్పుడు ప్రధాని ఆకస్మిక పర్యటన, రూ.1000 కోట్లు సాయం ఇచ్చారని గుర్తు చేశారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరే NDRF ద్వారా తెలంగాణకు ఇచ్చిన అదనపు నిధులు ఏమిచ్చారో కిషన్‌రెడ్డి ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అమిత్‌షా ఆధ్వర్యంలోని NDRF అదనపు నిధులు అడిగే ధైర్యం కిషన్‌రెడ్డికి లేదని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉంటూ సొంత రాష్ట్రానికి నిధులు తేలేని చేతకాని మంత్రి కిషన్‌రెడ్డి అని కేటీఆర్‌ విమర్శించారు. 

Updated Date - 2022-07-22T03:40:41+05:30 IST