పదో తరగతి అమ్మాయితో ఇంటర్ కుర్రాడి ప్రేమ.. మమ్మల్నిద్దరినీ ఒకే చితిపై కాల్చండి అంటూ లేఖ రాసి మరీ..

ABN , First Publish Date - 2021-09-09T03:03:03+05:30 IST

పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో..ఓ టీనేజ్ జంట తీసుకున్న నిర్ణయమిది..

పదో తరగతి అమ్మాయితో ఇంటర్ కుర్రాడి ప్రేమ.. మమ్మల్నిద్దరినీ ఒకే చితిపై కాల్చండి అంటూ లేఖ రాసి మరీ..

ఇంటర్నెట్ డెస్క్:  కంటిముందున్న దృశ్యాన్ని చూసి ఆ గొర్రెల కాపరి ఒక్కసారిగా షాకైపోయాడు. రెండు మృతదేహాలు పొలంలోని బావిలో తేలుతూ కనిపిస్తున్నాయి. వారిద్దరూ చూడటానికి చిన్న పిల్లల్లాగనే ఉన్నారు. వెంటనే అతడు పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించాడు.  బావి వద్దకు వచ్చి చూసిన ఊరి జనం ఒక్కసారిగా షాకైపోయారు. ఇలా బలవన్మరణానికి పాల్పడిన ఇద్దరూ స్కూలు విద్యార్ధులే. బాలుడిపేరు పర్వేష్ రౌత్, బాలిక పేరు పాయల్ మోడియా. అతడు పన్నెండో తరగతి ఆమెదేమో పదవ తరగతి. ఆత్మహత్య చేసుకుంటుంన్నామంటూ వారు లేఖ రాసిపెట్టి బావిలోకి దూకారు.  రాజస్థాన్ రాష్ట్రంలోని డుంగార్‌పూర్ గ్రామంలో మంగళవారం నాడు చోటుచేసుకున్న దారుణం ఇది. 

ఇవీ చదవండి..
ఇద్దరు పిల్లల తల్లి అయిన మేనత్తతో 18 ఏళ్ల కుర్రాడి ప్రేమాయణం.. చివరకు వీళ్ల కథ ఎన్ని మలుపులు తిరిగిందంటే..
రోజూ ఆటోలో ఇంటికి వెళ్లే క్రమంలో పళ్ల వ్యాపారితో ప్రేమలో పడ్డ 19 ఏళ్ల యువతి.. వీళ్ల లవ్ స్టోరీ చివరికి ఎలా ముగిసిందంటే..


గ్రామస్థులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. బాలుడి బ్యాగులో వారికి ఓ సూసైడ్ నోట్ లభించింది. మమ్మల్ని ఒకే చితిపై ఉంచి కాల్చండి అంటూ వారు తమ చివరి కోరిక తెలపడం ఊరి వారిని కలిచివేసింది. కాగా.. మరణంలోనూ తాము వేరుకాకుడదన్నట్టు ఆ యువ జంట ..నడుముచుట్టూ చున్నీతో తమనితాము కట్టేసుకుని బావిలోకి దూకారు. తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటుంన్నట్టు వారు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ముందుగా విషం తాగి ఆ తరువాత.. బావిలోకి దూకినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బావిలో నుంచి ఆ బాటిళ్లను కూడా వెలికి తీశారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం.. కుటుంబసభ్యులు ఆ యువ జంటకు అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ ఘటన కారణంగా కుటుంబసభ్యులతో పాటూ గ్రామస్తులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. 

Updated Date - 2021-09-09T03:03:03+05:30 IST