తల్లి ప్రియుడు వేధింపులు.. బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-29T17:41:10+05:30 IST

పుదుకోటలో మత్తు మాత్రలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో బాలిక తల్లి ప్రియుడిని పోలీసులు అరెస్టు

తల్లి ప్రియుడు వేధింపులు.. బాలిక ఆత్మహత్య

చెన్నై : పుదుకోటలో మత్తు మాత్రలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో బాలిక తల్లి ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట సెంగైతోపుకు చెందిన గణేశన్‌ ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్‌ మేనేజర్‌. ఆయనకు పుదుకోటటౌన్‌కు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్తను వదిలి 11 ఏళ్ల కుమార్తెతో నివసిస్తోంది. ఈక్రమంలో గణేశన్‌తో ఆమె వివాహేతర సంబంధం ఉంది. రోజూ ఇంటికి వచ్చే గణేశన్‌ బాలికకు నిద్రమాత్రలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. అతని వేధింపులు తట్టుకోలని బాలిక ఇంట్లో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న గణేష్‌ నగర్‌ పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద గణేశన్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

Updated Date - 2020-09-29T17:41:10+05:30 IST