రహస్యంగా club washroomలో నన్ను వీడియో తీశాడు...హైకోర్టుకు బాలిక ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-05-19T13:10:22+05:30 IST

జోధ్‌పూర్ ప్రముఖ క్లబ్‌లోని వాష్ రూంలో ఓ వ్యక్తి రహస్యంగా కెమెరా పెట్టి తనను చిత్రీకరించాడని ఓ మైనర్ బాలిక రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన ఉదంతం ...

రహస్యంగా club washroomలో నన్ను వీడియో తీశాడు...హైకోర్టుకు బాలిక ఫిర్యాదు

జోధ్‌పూర్ (రాజస్థాన్): జోధ్‌పూర్ ప్రముఖ క్లబ్‌లోని వాష్ రూంలో ఓ వ్యక్తి రహస్యంగా కెమెరా పెట్టి తనను చిత్రీకరించాడని ఓ మైనర్ బాలిక రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన ఉదంతం సంచలనం రేపింది. ఉమెద్ క్లబ్‌లో వాష్ రూంకు వెళ్లినపుడు తనను ఓ వ్యక్తి Secretగా వీడియో తీశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ మైనర్ బాలిక హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాలిక డిమాండ్ చేసింది. ఏప్రిల్ 24వతేదీన బాధిత బాలిక తన స్నేహితుడితో కలిసి క్లబ్‌కు వెళ్లింది.ఈత కొట్టిన తర్వాత వాష్‌రూమ్‌లో దుస్తులు మార్చుకుంటుండగా గోడకు అవతలి వైపు నుంచి ఎవరో రహస్యంగా వీడియో చిత్రీకరించడాన్ని బాలిక గమనించి అరుపులు, కేకలు పెట్టింది.వీడియో తీసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా క్లబ్‌లో వ్యక్తులు పట్టుకున్నారు. 


అనంతరం బాధిత బాలిక తల్లి క్లబ్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్లబ్ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదమున్నందున పోలీసులను తిరిగి వెళ్లమని క్లబ్ ఆఫీస్ బేరర్లు కోరారు. వీడియో చిత్రీకరణ విషయాన్ని తాము క్లబ్ లో అంతర్గతంగా సమస్యను పరిష్కరించుకుంటామని క్లబ్ నిర్వాహకులు చెప్పారు.వీడియో తీసిన నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో క్లబ్ వాళ్లు నిందితుడికి అనుకూలంగా ఉన్నారని బాధిత బాలిక తల్లి క్లబ్ ప్రెసిడెంట్, ముగ్గురు సభ్యులు, వీడియో తీసిన నిందితుడిపై ఉదయ్ మందిర్ పోలీసుస్టేషనులో కేసు పెట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విపుల్ సింఘ్వి తెలిపారు.రాజీకి అంగీకరించమని బాధితురాలిని బలవంతం చేశారని, విచారణ పూర్తయ్యే వరకు ఫోన్ క్లబ్‌లోనే ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ నిందితుడి మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చారని సింఘ్వి ఆరోపించారు.




ఉమెద్ క్లబ్‌ను 1922లో అప్పటి జోధ్‌పూర్ పాలకుడు స్థాపించారు.నిందితుడితో దర్యాప్తు అధికారికి వ్యక్తిగత సంబంధాల కారణంగా పోలీసులు ఈ అంశాన్ని సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదనే కారణంతో క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్‌ను కోర్టులో వేసినట్లు పిటిషనర్ అయిన బాలిక తల్లి తరఫు న్యాయవాది విపుల్ సింఘ్వి తెలిపారు.జోధ్‌పూర్ బెంచ్‌లోని జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ బుధవారం ఉమెద్ క్లబ్‌కు నోటీసు జారీ చేశారు. అక్కడ ఏప్రిల్ 24 న జరిగిన సంఘటనపై కేసు డైరీకి సంబంధించిన వాస్తవాల నివేదికలను సమర్పించాలని విచారణ అధికారికి కోర్టు సమన్లు ​​జారీ చేసింది.


Updated Date - 2022-05-19T13:10:22+05:30 IST