పేరెంట్స్‌కు చెప్పొద్దు.. అమెరికాలో ఒక స్కూల్ సర్వేలో టీచర్ సూచన!

ABN , First Publish Date - 2021-07-27T11:37:34+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని ఒక స్కూల్లో వింత సర్వే జరిగింది. జాతుల గురించి ‘ఫోర్త్ గ్రేడ్’ విధ్యార్థులపై ఈ

పేరెంట్స్‌కు చెప్పొద్దు.. అమెరికాలో ఒక స్కూల్ సర్వేలో టీచర్ సూచన!

మిన్నెసోటా: అగ్రరాజ్యం అమెరికాలోని ఒక స్కూల్లో వింత సర్వే జరిగింది. జాతుల గురించి ‘ఫోర్త్ గ్రేడ్’ విధ్యార్థులపై ఈ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేలో పాల్గొంటున్న విద్యార్థులకు టీచర్లు వింత సలహాలు ఇచ్చారు. ‘‘మీకు ప్రశ్నలు అర్థంకాకపోయినా సరే ఏదో ఒక సమాధానం ఇవ్వండి. అలాగే ఈ సర్వే గురించి మీ అమ్మానాన్నలకు చెప్పకండి’’ అని టీచర్లు చెప్పడంతో కొందరు విద్యార్థులు అవాక్కయ్యారు. ‘ఈక్విటీ సర్వే’ అని పిలుస్తున్న ఈ సర్వేను ఈక్విటీ అలియన్స్ ఆఫ్ మిన్నెసోటా నిర్వహించింది. మిన్నెసోటాలోని రివర్‌వ్యూ ఇంటర్మీడియెట్ స్కూల్‌లో ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. జాతుల వ్యవస్థపై ఈ సర్వే జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, అమెరికాలో పలుచోట్ల జాతివిద్వేష దాడులు జరగడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా జాతుల వ్యవస్థకు సంబంధించిన ‘క్రిటికల్ రేస్ థియరీ’ని విమర్శించారు. ఇది అవమానకరమైన జాతి వివక్ష అంటూ దుమ్మెత్తిపోశారు. అయితే దీనికి అమెరికా నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ మద్దుతు ఉండటం గమనార్హం.

Updated Date - 2021-07-27T11:37:34+05:30 IST