అమరావతి రైతులకు వ్యతిరేకం కాదు: ముత్తంశెట్టి

ABN , First Publish Date - 2020-02-24T09:03:18+05:30 IST

అమరావతికి, అక్కడి రైతులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని రాష్ట్ర క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులు

అమరావతి రైతులకు వ్యతిరేకం కాదు: ముత్తంశెట్టి

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 23: అమరావతికి, అక్కడి రైతులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని రాష్ట్ర క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం ఆయన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్‌లతో కలిసి ప్రారంభించారు. టీడీపీ నాయకులు మూడు రాజధానులపై అనేక ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.

Updated Date - 2020-02-24T09:03:18+05:30 IST