మల్లు స్వరాజ్యం మరణం పట్ల మంత్రుల సంతాపం

ABN , First Publish Date - 2022-03-20T20:20:10+05:30 IST

స్వాతంత్ర్య సమర యోధులురాలు, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.

మల్లు స్వరాజ్యం మరణం పట్ల మంత్రుల సంతాపం

హైదరాబాద్: స్వాతంత్ర్య సమర యోధులురాలు, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ ... పీడితవర్గాలకు మద్దతుగా మల్లు స్వరాజ్యం నిలిచారని అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ  చేతబట్టి  ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారని, బతుకమ్మ పాటలతో, ఉపన్యాసాలతో  మహిళల్ని చైతన్య పరచడంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారని కొనియాడారు.ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన ప్రగాఢ సంతాపాన్నితెలియజేశారు.


అలాగే మల్లు స్వరాజ్యం మరణం పట్ల పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఎంతో మంది పోరాటయోధులకు స్పూర్తిగా నిలిచారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు.


Updated Date - 2022-03-20T20:20:10+05:30 IST