అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి

ABN , First Publish Date - 2021-02-26T02:16:43+05:30 IST

అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి, అభ్యర్థి ని చూడండి.

అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి

కురవి: అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి, అభ్యర్థి ని చూడండి. భారీ మెజారిటీ తో ఎన్నుకోండి అని పట్టభద్రుల ఓటర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పట్టభద్రుల ఓటర్లకు పిలుపు నిచ్చారు. విద్యాధికుడు, విద్యాసంస్థల అధినేత, మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి, మన సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వద్ద చెప్పే చనువు ఉన్న నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచారు. 


నల్గొండ - వరంగల్ - ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా గురువారం కురవి లో టీఆరెఎస్ పార్టీ నాయకులు, పట్టభద్రుల తో నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి , సత్యవతి రాథోడ్, ఎంపి మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, అభ్యర్థి  పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని  మాట్లాడారు.సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,  సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ... పట్టభద్రుల ఓటర్లు అంటే, చదువుకున్న వారు, ఆలోచించి, విశ్లేషించి, విచక్షణ తో ఓటు వినియోగించాలని సూచించారు. ఏవేవో కొన్ని చిన్న ఆవేశాలకు లోను కావద్దన్నారు. 


టీఆరెఎస్ రాక ముందు, వచ్చాక పరిస్థితులు బేరీజు వేసుకుని చూడండి. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏదో ఒకటి మీకు అంది ఉంటాయి. మీ అనుభవం లోకి వచ్చి ఉంటాయి. ఇంత కంటే ఎవరైనా ఎక్కువ చేశారా? చేయగలరా? ఆలోచించండి. టీఆరెఎస్ అభ్యర్థికి మీ ఓటు వేసి గెలిపించండి... అంటూ పట్టభద్రుల ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2021-02-26T02:16:43+05:30 IST