మంత్రులు ఒరగబెట్టిందేమి లేదు: చినరాజప్ప

ABN , First Publish Date - 2022-04-09T02:10:30+05:30 IST

గత రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో మంత్రులు ఒరగబెట్టిందేమి లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు.

మంత్రులు ఒరగబెట్టిందేమి లేదు: చినరాజప్ప

సామర్లకోట: గత రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో మంత్రులు ఒరగబెట్టిందేమి లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. శుక్రవారం కాకినాడ జిల్లా సామర్లకోటలో రాజప్ప మీడియతో మాట్లాడుతూ ప్రజలు ఐదేళ్లు పాటు పాలించమంటే రెండున్నరేళ్లు మాత్రమే అంటూ మంత్రులను మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రులంతా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రెండున్నరేళ్ల పాలన ఆంక్షలతో ఆయా శాఖలపై ఏమాత్రం పట్టు సాధించలేకపోయారన్నారు. మంత్రులందరూ కాలక్షేపం చేశారని, రానున్న కొత్త మంత్రులు కూడా ఇదే ధోరణి కొనసాగిస్తారని జోస్యం చెప్పారు. అభివృద్ధి ఆలోచన ప్రభుత్వానికి అసలు లేదని తప్పుబట్టారు. మంత్రులందరూ బూతులు తిట్టడానికే కాలం సరిపుచ్చారని చినరాజప్ప విమర్శించారు.

Updated Date - 2022-04-09T02:10:30+05:30 IST