మంత్రుల బస్సు యాత్ర.. జన సమీకరణకు వాలంటీర్లపై ఒత్తిడి
ABN , First Publish Date - 2022-05-27T00:50:24+05:30 IST
మంత్రుల బస్సు యాత్రకు జన సమీకరణ బాధ్యతను వార్డు వాలంటీర్లకు అప్పగించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ...
శ్రీకాకుళం: మంత్రుల బస్సు యాత్రకు జన సమీకరణ బాధ్యతను వార్డు వాలంటీర్లకు అప్పగించారు. ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ వార్డు వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని వార్డు సచివాలయాలకు అధికారులు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రుల బస్సు యాత్రకు లబ్దిదారులను తీసుకురాకపోతే వాలంటీర్లే బాధ్యత వహించాలని ఫోన్లలో హెచ్చరికలు చేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారు.