AP News: ఆయన వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని వినాల్సిందే.. జీవీ ఆంజనేయులు

ABN , First Publish Date - 2022-10-01T01:17:25+05:30 IST

అమరావతి: సీఎం జగన్ వద్ద మంత్రుల తీరుపై టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మాట్లాడారు. ముఖ్యమంత్రి వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఆయన చెప్పింది వినాల్సిందేనని.. జగన్ నియంత పోకడలకు ముఖాలు కూడా చూపించలేక వైసీపీ నేతలు అంతర్గతంగా గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. అయితే తమ నాయకుడు వద్ద తమకున్న స్వేచ్ఛను గురించి ఆయన మాట్లా

AP News: ఆయన వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని వినాల్సిందే.. జీవీ ఆంజనేయులు

అమరావతి: సీఎం జగన్ వద్ద మంత్రుల తీరుపై టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మాట్లాడారు. ముఖ్యమంత్రి వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఆయన చెప్పింది వినాల్సిందేనని.. జగన్ నియంత పోకడలకు ముఖాలు కూడా చూపించలేక వైసీపీ నేతలు అంతర్గతంగా గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. అయితే తమ నాయకుడు వద్ద తమకున్న స్వేచ్ఛను గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మేము మా అధినేత వద్ద ఏదైనా స్వేచ్ఛగా చెప్పే స్వాతంత్ర్యం మాకుంది. గుంటూరు జిల్లాలో మంత్రుల అవినీతి, విచ్చలవిడి తనం‌పై ఐక్యంగా పోరాడతాం. గుంటూరు జిల్లా మంత్రులు పనికిరాని సన్నాసులు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వారే మంత్రులుగా ఉన్నారు. మంత్రులు అమరావతి పై విషం కక్కుతున్నారు. రూ.8లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకేం చేశారు’’ అని ఆంజనేయులు ప్రశ్నించారు. 

Updated Date - 2022-10-01T01:17:25+05:30 IST