ఆశ్రమ పాఠశాలలపై మంత్రి మేరుగ సమీక్ష

ABN , First Publish Date - 2022-05-23T05:19:12+05:30 IST

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆదివారం సాయంత్రం సర్క్యూట్‌ హౌస్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆశ్రమ పాఠశాలలపై మంత్రి మేరుగ సమీక్ష
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి మేరుగ నాగార్జున

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇవ్వాలని దిశా నిర్దేశం

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆదివారం సాయంత్రం సర్క్యూట్‌ హౌస్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఆదేశించారు. ప్రధానంగా ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థలలో సీట్లు వచ్చేలా తర్ఫీదు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో శత శాతం సీట్లు భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.


ఇంకా జిల్లాలో సాంక్షేమ సంక్షేమ శాఖలో పథఽకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకు న్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు డి.వి.రమణ మూర్తి, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ రఘు,  ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్‌ రూపవతి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:19:12+05:30 IST