రాజమండ్రి సెంట్రల్ జైలు సందర్శించిన మంత్రి వేణు

ABN , First Publish Date - 2020-08-09T21:45:29+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైలును మంత్రి చెల్లుబోయిన వేణు, కలెక్టర్ మురళీధరరెడ్డి సందర్శించారు. కరోనా బారినపడ్డ ఖైదీలకు వైద్య చర్యలను

రాజమండ్రి సెంట్రల్ జైలు సందర్శించిన మంత్రి వేణు

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్  జైలును మంత్రి చెల్లుబోయిన వేణు, కలెక్టర్ మురళీధరరెడ్డి సందర్శించారు. కరోనా బారినపడ్డ  ఖైదీలకు  వైద్య చర్యలను పరిశీలించారు. సెంట్రల్ జైలు ఖైదీలకు కరోనా పాజిటివ్ విషయంలో కుటుంబ సభ్యులకు భయాందోళన అవసరం లేదని మంత్రి తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఖైదీలకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ జైల్లో 272 మంది ఖైదీలు, 32 మంది జైలు సిబ్బందికి కరోనా సోకిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకే  సెంట్రల్ జైలు సందర్శించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-09T21:45:29+05:30 IST