చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి వేణు

ABN , First Publish Date - 2020-08-08T01:16:33+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఒక రాజ్యానికి రాజులా ప్రవర్తించాడని

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి వేణు

కాకినాడ : టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఒక రాజ్యానికి రాజులా ప్రవర్తించాడని అన్నారు. అమరావతి రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. రైతులు నష్టపోయారంటే అది చంద్రబాబు వల్లేనని అన్నారు. ప్రజస్వామ్యంపై నమ్మకం కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి వేణు.. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం బాబుకు అలవాటేనని దుయ్యబట్టారు. అమరావతిలో జరిగిన అక్రమాలు ఎప్పటికైనా బయట పడతాయని ఆయనకు తెలుసునని, అందుకే అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని మంత్రి పేర్కొన్నారు. అయితే, చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో శాశ్వతంగా ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసుకి భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చాడంటూ చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకునే స్థితిలో కూడా లేడన్నారు. ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరే ముందు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మంత్రి వేణు ఛాలెంట్ చేశారు.

Updated Date - 2020-08-08T01:16:33+05:30 IST