మతం పేరిట ప్రభుత్వంపై కుట్రలు: మంత్రి వేణు
ABN , First Publish Date - 2020-09-23T09:44:01+05:30 IST
మతం పేరిట ప్రభుత్వంపై కుట్రలు: మంత్రి వేణు
పత్తికొండ, సెప్టెంబరు 22: ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు మతం పేరిట కుట్రలు జరుగుతున్నాయని మంత్రి వేణగోపాలకృష్ణ అన్నారు. అంతర్వేది రథం దగ్ధంతో పాటు దుర్గమ్మ వెండి రథానికి చెందిన సింహాల మాయం ఘటనలను మతపరమైన దాడులుగా అభివర్ణించారు. ఈ ఘటనలపై సీఎం జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారని, బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవన్నారు. మంత్రి కొడాలి నాని వాఖ్యలను వక్రీకరించారన్నారు. తెలంగాణ మంత్రి హరీ్షరావు మీటర్లపై చేసిన విమర్శలు రాజకీయ కోణంగా భావిస్తున్నామని, భవిష్యత్లో ఆయనే పొగిడేలా ఆ పథకాన్ని సీఎం విజయవంతం చేస్తారని అన్నారు.