గుడి మనందరి బాధ్యత

ABN , First Publish Date - 2020-09-19T09:12:01+05:30 IST

గుడి మనందరి బాధ్యత

గుడి మనందరి బాధ్యత

కుట్రలను కలిసి ఛేదిద్దాం.. వెలంపల్లి పిలుపు


అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలపై జరుగుతున్న కుట్రలను ఛేదిద్దామని దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలో తన శాఖ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గుడి మనందరి బాధ్యత అని, అందరం కలిసి దేవాలయాలను అభివృద్ధి చేద్దామన్నారు. దేవాలయాలకు చెందిన అతిథిగృహాల్లో శుభ్రతను పాటించాలని, అధికారులు దేవాలయాలకు వన్నె తీసుకొచ్చే విధంగా పని చేయాలని మంత్రి సూచించారు. కొందరు రాజకీయ పార్టీల ముసుగులో జగనన్న ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా దేవాలయాలపై రాజకీయం చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. 

Updated Date - 2020-09-19T09:12:01+05:30 IST