మోదీ వైఖరి చూస్తే తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో?: మంత్రి Talasani

ABN , First Publish Date - 2022-02-09T19:20:33+05:30 IST

రాజ్యసభలో ప్రధాని మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మోదీ వైఖరి చూస్తే తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమో?: మంత్రి Talasani

హైదరాబాద్: రాజ్యసభలో ప్రధాని మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇన్నేళ్లు మోడీ గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వైఖరి చూస్తే తెలంగాణ, ఏపీని మళ్ళీ కలుపుతారేమోనని అనుమానం వస్తోందన్నారు. యూపీలో ఎస్పీ గెలుస్తుందని వస్తున్న సర్వేలు చూసి మోదీ డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. 

Updated Date - 2022-02-09T19:20:33+05:30 IST