ఇది ట్రైలర్ మాత్రమే... ఇక సినిమా చూపిస్తాం: Talasani

ABN , First Publish Date - 2021-11-12T18:49:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో బీజేపీపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇది ట్రైలర్ మాత్రమే... ఇక సినిమా చూపిస్తాం: Talasani

హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నా కొనసాగుతోంది. నగరంలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరి ధాన్యం కొనాల్సింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. ఇది ట్రైలర్ మాత్రమే బీజేపీకి ఇక సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ‘‘మేము తలుచుకుంటే  మీ పీఠం కదిలిస్తాం...మేము బరితెగిస్తే మీరు ఉంటారా? ... తెలంగాణ రైతాంగం తలుచుకుంటే బీజేపీ ప్రభుత్వం కూలుతుంది’’ అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ధర్నా చేయడానికి కనీసం జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. అలాగే ధర్నాచౌక్‌ను తాము ఎత్తి వేయలేదని స్పష్టం చేశారు. ధర్నా చౌక్ వల్ల ఇబ్బంది అవుతుందని స్థానికులే కోరారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. 

Updated Date - 2021-11-12T18:49:47+05:30 IST