శోభా యాత్రకు భారీ ఏర్పాట్లు: తలసాని
ABN , First Publish Date - 2021-09-17T23:09:34+05:30 IST
నగరంలో ఆదివారం జరిగే వినాయకుడి శోభా యాత్రకు భారీగా ఏర్పాట్లు చేశామని
హైదరాబాద్: నగరంలో ఆదివారం జరిగే వినాయకుడి శోభా యాత్రకు భారీగా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. అన్ని విభాగాల సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసామన్నారు. హుస్సేన్సాగర్పై అంబులెన్స్లను అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ట్యాంక్బండ్పై 1,25,000 మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు.