బిసిలు సంఘటితంగా ఉండి అభివృద్ధి సాధించాలి

ABN , First Publish Date - 2022-02-20T20:24:21+05:30 IST

తెలంగాణ ఏర్పడిన తర్వాత బిసిలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బిసి శాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

బిసిలు సంఘటితంగా ఉండి అభివృద్ధి సాధించాలి

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత బిసిలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బిసి శాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బిసిలను కేవలం ఓటుబ్యాంకుగానే భావించారు తప్ప వారి అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్ లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌరవ భవనాల శంకుస్ధాపనలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిసిలు సంఘటితంగా ఉండి  అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఏ ప్రభుత్వం కూడా బిసిల బాగోగులను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బిసిలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి, ఆత్మగౌరవం తో బతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు. తెలంగాణలోని అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు భూమి కేటాయించి, నిధులు అందిస్తున్నఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 

Updated Date - 2022-02-20T20:24:21+05:30 IST