Distribution of National Flags: నెక్లెస్రోడ్లో జాతీయ పతాకాలను పంపిణీ చేసిన మంత్రి తలసాని
ABN , First Publish Date - 2022-08-09T14:48:06+05:30 IST
భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతకాలను పంపిణీ చేశారు.
హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani srinivas yadav) జాతీయ పతకాల (National flag)ను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ (Telangana)లో స్వతంత్ర వజ్రోత్సవాలు నిన్నటి నుంచి 22 వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వన మహోత్సవం, ఫ్రీడమ్ రన్, జాతీయ రక్షా బంధన్, ఫైర్ వర్క్స్, హాస్పిటల్స్లో పండ్ల పంపిణీ , రంగోళి ఇలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కోటి 20 లక్షల జాతీయ జెండాలు ఇస్తున్నామన్నారు. 15న ఉదయం 11 గంటలకు అన్ని జంక్షన్లలో జాతీయ గీతాలాపాన చేయనున్నట్లు తెలిపారు. అలాగే 21న లోకల్ బాడీ నుంచి అసెంబ్లీ వరకు జనరల్ బాడీ మీటింగ్స్ జరుగనున్నాయన్నారు. ఈరోజు నుంచి రాష్ట్రంలో 529 తెరలపై గాంధీ చిత్రాల ప్రదర్శన ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.