సీనియర్ బీజేపీ నాయకులు భవర్ లాల్ వర్మ మృతి
ABN , First Publish Date - 2021-04-17T20:04:10+05:30 IST
రాష్ర భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ నియోజక వర్గం నాయకుడు భవర్ లాల్ వర్మ తీవ్ర అనారోగ్యంతో మరణించారు.
హైదరాబాద్: రాష్ర భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ నియోజక వర్గం నాయకుడు భవర్ లాల్ వర్మ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న వర్మ పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణించారన్న వార్త తెలిసి పలువురు బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, స్ధానికులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భవర్ లాల్ వర్మ మృతి పట్ల పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. భవర్ లాల్ వర్మ మరణించిన విషయం తెలుసుకున్నమంత్రి రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో గల తన ఇంటికి వెళ్లి మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవర్ లాల్ వర్మ మృతి బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం, సానుభూతిని తెలిపారు.