లతామంగేష్కర్ మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం

ABN , First Publish Date - 2022-02-06T20:12:12+05:30 IST

ప్రముఖ నేపధ్య గాయని, భారత రత్న లతామంగేష్కర్ మృతి పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

లతామంగేష్కర్ మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం

హైదరాబాద్: ప్రముఖ నేపధ్య గాయని, భారత రత్న లతామంగేష్కర్ మృతి పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశం గర్వించదగ్గ గాయనిగా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారని, నాటికి, నేటికి ఆమె పాటలు సంగీత అభిమానులను అలరిస్తాయని గుర్తు చేసుకున్నారు.ఆమె మృతితో సంగీత అభిమానులు, సినీ పరిశ్రమ ఒక గొప్ప గాయనిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2022-02-06T20:12:12+05:30 IST