జానారెడ్డి ఇప్పటికే మునిగి ఉన్నారు: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-04-08T20:24:17+05:30 IST

జానారెడ్డి ఇప్పటికే మునిగి ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

జానారెడ్డి ఇప్పటికే మునిగి ఉన్నారు: మంత్రి తలసాని

నల్లగొండ: 35 ఏళ్ళుగా కాంగ్రెస్ నేత జానారెడ్డి మభ్యపెడుతున్న ప్రజలను చైతన్యం చేయడానికే టీఆర్ఎస్ నాయకులు వచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జానారెడ్డి ఇప్పటికే మునిగి ఉన్నారని, వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇంకా ముంచుతారని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, తమ అందరి కృషి పలిస్తుందని అన్నారు. 2014కు ముందు యువత ఆత్మహత్యలపై పరిశీలన చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. యువత తొందర పడి ప్రాణాలు తీసుకొవద్దని, అతి త్వరలోనే మరొక 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ సమస్యపై మాట్లాడే అర్హత లేదని మంత్రి తలసాని అన్నారు.

Updated Date - 2021-04-08T20:24:17+05:30 IST