తెలంగాణ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీదనే కేంద్రం నడుస్తోంది:తలసాని

ABN , First Publish Date - 2022-02-14T21:51:56+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీదనే కేంద్రం నడుస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీదనే కేంద్రం నడుస్తోంది:తలసాని

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీదనే కేంద్రం నడుస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.మోటర్ల కు మీటర్లు పెట్టాలని సంస్కరణలు చేస్తున్నారని ఇది సిగ్గు చేటని ఆయన దుయ్యబట్టారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడితన మంత్రి తలసాని కేంద్రం పై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ నాయకులకు మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వేరొకటి తెలియదని ఆరోపించారు.చివరకు ఆర్మీని కూడా రాజకీయనికి అడ్డం పెడుతారని అన్నారు.


హిందుస్తాన్, పాకిస్తాన్ జీవిత కాలం బీజేపీది ఇదే నినాదమని అన్నారు. అసలు బిజెపి నాయకులకు బుద్ది జ్ఞానo ఉందా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి ఒళ్ళు దగ్గరపెట్టుకో?నిన్ను హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈయనేదో యుద్ధం చేస్తాడట..గెలిచి మూడేళ్లయ్యింది,సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశావ్?వరదలు వస్తే కేంద్రం నుండి రూపాయి తెచ్చావా?వరదల సమయంలో పొలిటికల్ డ్రామా చేశారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులుకూడా సిగ్గులేకుండా మాట్లాడుతున్నరని, మానిక్కం ఠాగూర్ సిగ్గులేదన్నారు.నువ్వు వచ్చాకే జరిగిన ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. తెలంగాణ పై ప్రధాని మోదీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు మోడీ ముచ్చింతల్ కి రావటమే తప్పు..ఆ కార్యక్రమం కూడా ఈక్వాలిటీ పేరుతో చేసేది..మోడీలో సమైక్యత లేదు..ముచ్చింతల్ కి వచ్చి 5రాష్ట్రాల ఎన్నికల ప్రచారంగా వాడుకున్నాడని విమర్శించారు. 

Updated Date - 2022-02-14T21:51:56+05:30 IST