మీరు నివసిస్తున్న జీహెచ్ఎంసి క్వార్టర్స్ ఇక మీకే: తలసాని

ABN , First Publish Date - 2022-01-15T22:35:27+05:30 IST

మీరు నివసిస్తున్న జీహెచ్ఎంసి క్వార్టర్స్ ఇక మీవే కాబోతున్నాయి...క్వార్టర్స్ లలో నివసిస్తున్న ప్రజలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభ వార్త చెప్పారు.

మీరు నివసిస్తున్న జీహెచ్ఎంసి క్వార్టర్స్ ఇక మీకే: తలసాని

హైదరాబాద్: మీరు నివసిస్తున్న జీహెచ్ఎంసి క్వార్టర్స్ ఇక మీవే కాబోతున్నాయి...క్వార్టర్స్ లలో నివసిస్తున్న ప్రజలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభ వార్త చెప్పారు. విషయానికి వస్తే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్, బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయగూడ, రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట ప్రాంతాల్లోని లబ్ధిదారులతో మంత్రి తలసాని  సమావేశం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి రెగ్యులరైజ్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుక ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు.ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసునని మంత్రి తలసాని పేర్కొన్నారు. జీహెచ్ఎంసి క్వార్టర్స్, లీజు ల్యాండ్స్ లలో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్నపేద, మధ్య తరగతి ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను.పెద్ద మనసుతో రెగ్యులరైజ్ చేసేందుకు సీఎం అంగీకరించారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తలసాని తమ ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయాలని లబ్ధిదారుల విజ్ఞప్తి  చేశారు. దీంతో నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంత్రి చేసిన ప్రకటనతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-15T22:35:27+05:30 IST