రైతుల కోసమే తమ పోరాటం: తలసాని

ABN , First Publish Date - 2021-11-18T00:15:59+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

రైతుల కోసమే తమ పోరాటం: తలసాని

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం అందుకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. గురువారం ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా ఏర్పాట్లను బుధవారం మంత్రి హరీశ్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ  ప్రభుత్వం లో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.


రైతుల కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చేలా మహాధర్నా నిర్వహిస్తామన్నారు.పోయిన యాసంగి వడ్లు ఇంకా గోడన్ లో ఉన్నవి.అవి ఇంకా కొనడం లేదు..కొనడం పై కేంద్రం క్లారటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.పంజాబ్ లో కొంటారు కానీ తెలంగాణ లో ఎందుకు కొనరని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రంలో ఉండే టీఆరెస్ పార్టీ శ్రేణులతో ఇందిరా పార్కు వద్ద మహా జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలే హైకమాండ్ గా పనిచేసే పార్టీ టీఆర్ ఎస్ అని ఆయన అన్నారు. 

Updated Date - 2021-11-18T00:15:59+05:30 IST