తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్పనేత ఎన్టీఆర్:Talasani

ABN , First Publish Date - 2022-05-28T22:14:27+05:30 IST

లుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప నాయకులు, చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) పేర్కొన్నారు.

తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్పనేత ఎన్టీఆర్:Talasani

హైదరాబాద్: తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప నాయకులు, చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) పేర్కొన్నారు. శనివారం NTR శతజయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప నటుడుగా, ప్రజానాయకుడుగా ఎందరో అభిమానులను తన సొంతం చేసుకొన్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎంతో అభిమానంతో  “అన్నగారు” అని పిలుచుకొనే నందమూరి తారక రామారావు సామాజిక, పౌరాణికం తదితర పాత్రలతో తెలుగు,  తమిళం,  హిందీ భాషలలో కలిపి దాదాపు 400 పైగా చిత్రాలలో  నటించారని చెప్పారు. 


అనేక  చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారని తెలిపారు. రాముడు, భీముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి అనేక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయాడని అన్నారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారంటే అది ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణకు నిదర్శనంగా పేర్కొన్నారు. 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గా పని చేసి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి గా పని చేసిన ఘనత ను కూడా దక్కించుకున్నారని తెలిపారు. భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పారు. 

Updated Date - 2022-05-28T22:14:27+05:30 IST