వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-04T20:17:35+05:30 IST

జంటనగరాల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు.

వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

హైదరాబాద్: జంటనగరాల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. సోమవారం ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్ఎన్డిపీ కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు చేపట్టిన నాలాలను మంత్రి తలసాని పరిశీలించారు.వరద ముంపుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న నాలాల పై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తామని మంత్రి తెలిపారు.ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుండి వచ్చే వరదతో ముంపుకు గురవుతున్ననాలా పరిసర కాలనీలు, బస్తీలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో పరిష్కారం చేస్తున్నట్టు తెలిపారు.


మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎన్ఎన్డీపీ కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది మంత్రి వెల్లడించారు.వరదలు వచ్చిన సమయాలలో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని కోట్ల నిదులైనా ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈసందర్భంగా మంత్రి తలసాని వెంట ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-04-04T20:17:35+05:30 IST