పేద ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం: తలసాని
ABN , First Publish Date - 2020-10-30T22:03:46+05:30 IST
పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన మహిళలు 10 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం పట్ల మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుందని సంతోషం వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి పేద, మధ్య తరగతి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం కోసం 550 కోట్ల రూపాయలు విడుదల చేశారని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ, ఆకుల రూప, కుర్మ హేమలత, ఉప్పల తరుణి తదితరులు ఉన్నారు.