టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు: తలసాని

ABN , First Publish Date - 2021-09-02T21:16:45+05:30 IST

తెలంగాణలో టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు: తలసాని

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమాజిగూడ వద్ధ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్వయం పాలన రావాలి..అప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ముందే గుర్తించిన నాటి ఉద్యమకారుడు..నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. 

Updated Date - 2021-09-02T21:16:45+05:30 IST