మంత్రి తలసాని ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఆవిర్భావం

ABN , First Publish Date - 2022-04-27T20:01:51+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు.

మంత్రి తలసాని ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఆవిర్భావం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పద్మారావు నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21 కిలోల కేక్ ను మంత్రి కేటీఆర్ కట్ చేశారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు పద్మారావు నగర్ పార్టీ ఇంచార్జి పవన్ కుమార్ గౌడ్ మెమెంటో ను అందజేశారు. తెలంగాణ పాటలు, బాణసంచా చప్పుళ్ళ తో తెలంగాణ భవన్ సందడిగా మారింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నగరంలోని పలు ప్రాంతాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Updated Date - 2022-04-27T20:01:51+05:30 IST