అమరావతి: రాష్ట్రంలోని మూడు పార్టీలు కూడబలుక్కుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు మానవ తప్పిదం అనడం దారుణమన్నారు. వరదల వల్ల ప్రాణనష్టం కలుగకుండా కాపాడగలిగామన్నారు. రెండు ఘటనల్లో మినహా ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదన్నారు.