సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ ప్రారంభం: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2020-08-12T23:06:54+05:30 IST

రాష్ట్రంలో పాఠశాలలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఆగస్టు 31 వరకు

సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ ప్రారంభం: మంత్రి సురేష్

ప్రకాశం : రాష్ట్రంలో పాఠశాలలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఆగస్టు 31 వరకు స్కూల్స్ ప్రారంభించకూడదని ఆదేశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి సురేష్.. పాఠశాలల ప్రారంభంపై ఆగస్టు 31 తరువాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా నాడు - నేడు పనులను పూర్తి చేసి పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. అదే రోజు 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

Updated Date - 2020-08-12T23:06:54+05:30 IST