ఆయనకు మతిపోయింది: మంత్రి

ABN , First Publish Date - 2021-10-29T17:46:36+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మతి కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి బీ శ్రీరాములు ధ్వజమెత్తారు. గురువారం బీఐటీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆ యన మీడియాతో మాట్లాడారు. దేశ

ఆయనకు మతిపోయింది: మంత్రి

బళ్లారి(Karnataka): మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మతి కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి బీ శ్రీరాములు ధ్వజమెత్తారు. గురువారం బీఐటీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆ యన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఏక వచనంతో సంబోధిచడం సీనియర్‌ నేత సిద్దరామయ్యకు తగదని హితువు పలికారు. రాష్ట్ర ముఖ్యమం త్రితో పాటు బీజేపీ సీనియర్‌ నాయకులను సిద్ధరామయ్య దూషించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో దళిత నాయకులకు ముఖ్యమంత్రి హోదా కల్పించలేదని, దళితులను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటోందే తప్ప వారి సంక్షేమానికి  చేసింది శూన్యమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు స్థానాల్లో జ రుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కచ్చితంగా గెలుపు సాధిస్తారన్నారు.

Updated Date - 2021-10-29T17:46:36+05:30 IST