కిడ్నాప్లపై మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పందించాలి: డీకే అరుణ
ABN , First Publish Date - 2022-02-27T19:12:35+05:30 IST
మహబూబ్నగర్ కిడ్నాప్లపై మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పందించాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.
మహబూబ్నగర్: జిల్లాలో జరిగిన కిడ్నాప్లపై మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పందించాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఆదివారం అరుణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత నాగరాజుని ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారన్నారు. ఎస్వోటీ పోలీసులు తీసుకెళ్తే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు కిడ్నాప్లతో శ్రీనివాస్గౌడ్కు ఏమైనా సంబంధం ఉందా తేల్చాలన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎన్నికల అఫిడవిట్ను రెండు సార్లు అప్లోడ్ చేశారని చెప్పారు. కిడ్నాప్లతో శ్రీనివాస్గౌడ్కు సంబంధం లేకపోతే స్పందించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.