అల్లూరి తెలంగాణలో పుట్టుంటే 24ఎకరాలు కేటాయించే వాళ్లం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ABN , First Publish Date - 2022-01-02T19:33:08+05:30 IST
అల్లూరి సీతారామరాజు తెలంగాణలో పుట్టుంటే 24ఎకరాలు కేటాయించే వాళ్లమని మంత్రి శ్రీనివాస్గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: అల్లూరి సీతారామరాజు తెలంగాణలో పుట్టుంటే 24ఎకరాలు కేటాయించే వాళ్లమని మంత్రి శ్రీనివాస్గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..దక్షిణాది వాడు, తెలుగు వాడైనందునే సీతారామరాజుపై కేంద్రం వివక్ష చూపుతుందోని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్తో మాట్లాడి కొంపల్లి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజులతో తెలంగాణ ప్రభుత్వానిది ప్రత్యేక అనుబంధమన్నారు. రాజులతో మాకు విడదీయరాని బంధం ఉందన్నారు. రాజులను అన్ని రకాలుగా కాపాడుకుంటామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో రాజులది కీలకపాత్ర అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ రాజులవేనని చెప్పారు. ఏపీలో వందఎకరాలు అమ్మితే తెలంగాణలో ఒక్క ఎకరమే వస్తోందని మంత్రి శ్రీనివాస్గౌడ్ వ్యాఖ్యానించారు.