బీజేపీ ఉద్యోగాల హామీ ఏమైంది: మంత్రి శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2021-03-04T19:53:11+05:30 IST
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు.
మహబూబ్నగర్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. గురువారం జిల్లాలోని కోర్టు ప్రాంగణంలో గల మీటింగ్ హాల్లో అడ్వకేట్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 70ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ సంక్షేమానికి వందకోట్లు.. లక్ష 32వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న న్యాయ, అన్యాయాలపై దృష్టి సారించాలన్నారు. మేధావులు మౌనం వహిస్తే సమాజానికి ఇబ్బంది కలుగుతుందన్నారు. కోర్టు విషయంలో భూమి అందుబాటులో ఉంది. మీ ఏకాభిప్రాయంతో నూతన భవన సముదాయ నిర్మాణం ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.