క్రీడా మైదానాల్లో కోవిడ్‌ నిబంధనలతో శిక్షణ ఇవ్వాలి- శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-10-24T21:25:22+05:30 IST

రాష్ట్రంలోని క్రీడా మైదానాల్లో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా క్రీడా శిక్షణ కొనసాగించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు.

క్రీడా మైదానాల్లో కోవిడ్‌ నిబంధనలతో శిక్షణ ఇవ్వాలి- శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని క్రీడా మైదానాల్లో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా క్రీడా శిక్షణ కొనసాగించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. క్రీడల అభివృద్ధికి జిల్లాలో ప్రతి క్రీడా అధికారి ఉండాలని అన్నారు. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న డివైఎస్‌వో పోస్టుల్లో క్రీడా శాఖ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించాలని లేదా ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా ఎంపిక చేసి వెంటనే నియమించాలని క్రీడాశాఖ ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో ఇండోర్‌ స్టేడియం స్ధాపనకు డిటేయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారుచేయాని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేయబోయే వాలిబాల్‌, బాక్సింగ్‌, ఆర్చరీ, హ్యాండ్‌బాల్‌,అథ్లెటిక్స్‌ అకాడమీల ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు.

Updated Date - 2020-10-24T21:25:22+05:30 IST