పాలమూరులో కల్లోలం సృష్టించాలని యత్నం: మంత్రి శ్రీనివాస్
ABN , First Publish Date - 2022-03-08T17:49:15+05:30 IST
ప్రశాంతంగా ఉన్న పాలమూరులో కల్లోలం సృష్టించాలని, కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్: ప్రశాంతంగా ఉన్న పాలమూరులో కల్లోలం సృష్టించాలని, కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారి కుట్రలను ఎంత మాత్రం సహించేది లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం పాటుపడతానని... అభివృద్దిని ఎవరూ ఆపలేరని మంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.