ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు: మంత్రి Srinivas
ABN , First Publish Date - 2021-12-14T19:42:07+05:30 IST
ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు కూడా టీఆర్ఎస్కు పడ్డాయని తెలిపారు.
హైదరాబాద్: ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు కూడా టీఆర్ఎస్కు పడ్డాయని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్- బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కేసీఆర్ అభివృద్ధికి ఓటు వేశారన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా టిఆర్ఎస్ పథకాలు అందుతున్నాయని చెప్పారు. పచ్చని తెలంగాణను నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అధికార పార్టీ ఓట్లు తమకు పడతాయని ప్రతిపక్ష పార్టీ నేతలు గాల్లోమేడలు కట్టుకున్నారని యెద్దేవా చేశారు. ఈ ఎన్నిక కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్న దానికి నిదర్శనమని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.