ఐదేళ్లలోపు పిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
ABN , First Publish Date - 2022-05-06T13:41:58+05:30 IST
రాష్ట్రంలో ఇక నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్ ప్రకటించారు. అసెంబ్లీలో
- మంత్రి శివశంకర్
ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలో ఇక నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం ఉదయం రవాణా శాఖ పద్దు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శివశంకర్ కొన్ని కొత్త రాయితీలు ప్రకటించారు. రాయితీతో కూడిన సీజన్ టిక్కెట్లు ఇకపై ఆన్లైన్ ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. చెన్నై, తిరుచ్చి, విల్లుపురం రవాణా మండలాల్లోని బస్ డిపోల స్థాయి పెంచి ఆధునికీకరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ డిపోల్లో బస్సులు శుభ్రం చేసేందుకు ఆటోమేటిక్ విధానాన్ని అమలుచేయనున్నామన్నారు. ఈ సౌకర్యం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ డిపోల్లో ప్రభుత్వ శాఖల వాహనాలకు మరమ్మతు నిర్వహించేలా ఆధునిక మొబైల్ డిపోలను రూపొందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థలన్నింటినీ సమైక్యపరచి ప్రయాణికుల సౌకర్యార్ధం సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నామని మంత్రి తెలిపారు.