పోషకాహారంలో తెలంగాణ నెంబర్ వన్ కావాలి: మంత్రి సత్యవతి రాధోడ్

ABN , First Publish Date - 2021-10-01T20:32:22+05:30 IST

అన్ని రంగాలల్లో దేశానికి మోడల్ గా ఉన్న తెలంగాణ అంగన్వాడీలో కూడా ఆదర్శంగా మారాలని మాతా శిశు సంఓేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు.

పోషకాహారంలో తెలంగాణ నెంబర్ వన్ కావాలి: మంత్రి సత్యవతి రాధోడ్

హైదరాబాద్: అన్ని రంగాలల్లో దేశానికి మోడల్ గా ఉన్న తెలంగాణ అంగన్వాడీలో కూడా ఆదర్శంగా మారాలని మాతా శిశు సంఓేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు.పోషకాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేసి బంగారు తెలంగాణ లక్ష్యం సాధించాలని పిలుపునిచ్చారు.ఎంసిహెచ్ఆర్డిలో జరిగిన పోషణ్ మహ-2021 ముగింపు సమావేశంలో ఆమె పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోషకాహారలోపం నివారణే లక్ష్యంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ పనిచేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోషకాహార బోనమెత్తారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశించిన బంగారు తెలంగాణ సాధించడానికి రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషకాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేయాలని అన్నారు. 


పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించడం కోసం చైతన్యం కల్పించేందుకు పోషణ మహ 2021 నిర్వహించినట్టు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహారంలో దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసి పనిచేయాలని, సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చాలని పిలుపునిచ్చారు.అంగన్వాడీలలో పనిచేస్తున్న మనం మొదట తల్లులం. మనం అధికారులుగా, ఉద్యోగులుగా కాకుండా బాధ్యతగా పని చేయడం ద్వారానే పోషకాహార లోపాన్ని నివారించగలమని మంత్రి పేర్కొన్నారు.


Updated Date - 2021-10-01T20:32:22+05:30 IST