మంత్రి సబితాను నిలదీసిన కార్పొరేటర్లు

ABN , First Publish Date - 2020-10-16T12:53:38+05:30 IST

జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో అల్మాస్ గూడా కురుమల గూడ నీటి ప్రవాహంతో ఉన్న కాలనీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు.

మంత్రి సబితాను నిలదీసిన కార్పొరేటర్లు

రంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో అల్మాస్ గూడా కురుమల గూడ నీటి ప్రవాహంతో ఉన్న కాలనీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. కాగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి పర్యటించడంపై కార్పొరేటర్లు ప్రశ్నించారు. గత రెండు మూడు రోజుల నుండి స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బస్తీలో తిరుగుతూ స్థానిక ప్రజల అవసరాలు తీరుస్తూ ఉన్నామన్నారు. అయితే ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం కనీసం స్థానిక కౌన్సిలర్లకు సమాచారం లేకుండా వార్డుల్లో తిరగడం దారుణమని మంత్రి సబితాను స్థానిక కార్పొరేటర్లు నిలదీశారు. చేసేదేమీలేక మంత్రి సబితా అక్కడి నుండి ఏమి సమాధానం చెప్పకుండా వెనుతిరిగారు. మూడు రోజులుగా మహేశ్వరం నియోజకవర్గంలో కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-10-16T12:53:38+05:30 IST