ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు: మంత్రి సబిత
ABN , First Publish Date - 2022-04-30T21:34:26+05:30 IST
విద్యాశాఖపై మంత్రి సబిత అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.
హైదరాబాద్: విద్యాశాఖపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఆ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ..ఈ భేటీలో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి కేసీఆర్ రూ.7 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని జూన్ 10 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రౌండ్ ఉన్న స్కూళ్లకి ప్లేయింగ్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తానట్లు చెప్పారు. పేరెంట్స్తో మీటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించామని మంత్రి సబిత పేర్కొన్నారు.