మంత్రి సబితను నిలదీసిన బీజేపీ శ్రేణులు

ABN , First Publish Date - 2020-10-24T10:15:57+05:30 IST

వరద బాధితులకు సహాయ పంపిణీ కార్యక్రమం ఆర్‌కే.పురం డివిజన్‌ ఎన్‌టీఆర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య గొడవకు దారితీసింది

మంత్రి సబితను నిలదీసిన బీజేపీ శ్రేణులు

ఎల్‌బీనగర్‌, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): వరద బాధితులకు సహాయ పంపిణీ కార్యక్రమం ఆర్‌కే.పురం డివిజన్‌ ఎన్‌టీఆర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య గొడవకు దారితీసింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులకే ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబిత వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా బీజేపీ నాయకులపై తమ వాదనలతో ఎదురుదాడికి దిగారు. మంత్రి ముందే ఇరువర్గాల తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాల వారిని పంపించేశారు. ప్రభుత్వం అందజేస్తున్న రూ.10వేల సహాయం టీఆర్‌ఎస్‌ పార్టీ వారికే అందిస్తున్నారని ఆర్‌.కె.పురం కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతోనే బాధితుల జాబితా ఉందని విమర్శించారు. 

Updated Date - 2020-10-24T10:15:57+05:30 IST