మనఊరు-మనబడి పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2022-04-30T20:17:25+05:30 IST

రాష్ట్రంలోని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వైభవం తేవడానికి, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు - మన బస్తీ - మన బడి కార్యక్రమం చేపట్టారు.

మనఊరు-మనబడి పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వైభవం తేవడానికి, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు - మన బస్తీ - మన బడి కార్యక్రమం చేపట్టారు. దీనిని మరింతగా విస్తరించేందుకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సమావేశం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రారంభం అయింది.ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, కేటీఆర్, తలసాని, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఆయా శాఖల అధికారులు హాజరు అయ్యారు. ఈసందర్భంగా మన ఊరు-మనబస్తీ-మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

Updated Date - 2022-04-30T20:17:25+05:30 IST