Vijayawada: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి Roja

ABN , First Publish Date - 2022-05-04T17:48:34+05:30 IST

విజయవాడలోని Kbn కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు.

Vijayawada: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి Roja

Vijayawada: రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో Kbn కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. ఈనాటి  యువత  సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం  మంచి  విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి  ప్రాణం నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు  నడిపేది యువతేనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.

Read more